లీటరు డీజిల్పై మూడు రూపాయలు పెంచిన ప్రభుత్వం

లీటరు డీజిల్పై రూ. 3, వంటగ్యాస్ సిలిండర్పై రూ. 50 మరియు కిరోసిన్ రేటు లీటర్కు రూ.2 చొప్పున ధరలను పెంచడం జరిగింది. ధరల పెంపుపై శుక్రవారం సమావేశమైన మంత్రుల సాధికారిక బృందం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
పెరిగిన రేట్లు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ నేతృత్వం వహించారు. తాజా పెంపు వాహనచోదకులు, పరిశ్రమలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








