తాగి వాహనం నడిపితే.. జరిమానాతో పాటు జైలు శిక్ష ఫ్రీ..!

ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన ఢిల్లీ ప్రభుత్వం తాగి వాహనాలు నడిపే వారిపై కొరడా జులిపించింది. తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కిన వారిని కేవలం జరిమానాతో వదిలిపెట్టకుండా జైలుశిక్ష విధించాలని తేల్చి చెప్పింది. ఈ విషయంలో స్థానిక మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లి హైకోర్టు సమర్థించింది. తాగి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కిన కుమార్ అనే ఓ వ్యక్తి మేజిస్ట్రేట్ ముందు తాను తాగి వాహనం నడిపినట్లు ఒప్పుడకున్నాడు. దీంతో మేజిస్ట్రేట్ కోర్టు అతనికి రూ. 500 జరిమానాతో పాటు 10 రోజుల జైలు శిక్ష విధించింది. దీంతో కుమార్ ఈ తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. కానీ అక్కడ కుమార్కు చుక్కెదురైంది. దీంతో కుమార్ కటకటాల వెనక్కు వెళ్లాడు.


Click it and Unblock the Notifications








