భారత్లో విక్రయాలను రెట్టింపు చేయడమే లక్ష్యం: డ్యుకాటి

భారత మార్కెట్లో అధిక డిమాండ్ ఉందని, కొత్త మోటార్సైకిల్ తయారీదారుల భారత్కు రావడంతో మార్కెట్ మరింత వృద్ధి చెందిందని బోర్డిగా తెలిపారు. ఇప్పుడప్పుడే భారత్లో అసెంబ్లింగ్ ప్లాంటు ఏర్పాటు చేసే ఆలోచన లేదని ఆయన అన్నారు. భారత మార్కెట్లో ఇప్పటికే హ్యార్లీ డేవిడ్సన్, సుజుకి మోటార్ కార్ప్, కవాసకి, యమహా మోటార్, బిఎమ్డబ్ల్యూ వంటి కంపెనీలు ప్రిమీయం బైక్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటికి తోడు తాజాగా బ్రిటన్కు చెందిన మరో కొత్త కంపెనీ ట్రైయంప్ కూడా దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న సంగతి తెలిసిందే.
2008లో డ్యుకాటి భారత్లో విక్రయాలను ప్రారంభించింది. ప్రస్తుతం 15 మోడళ్ల హై-పెర్ఫామెన్స్ మోటార్సైకిళ్లను దేశీయ మార్కెట్లో అందిస్తోంది. వాటిల్లో సూపర్బైక్ 1098ఆర్ మరియు హైపర్మోటార్డ్ 1100ఎస్ వంటి మోడళ్లు కూడా ఉన్నాయి. కంపెనీ ఇటీవలే మరో లగ్జరీ బైక్ డయావెల్ను కూడా విడుదల చేసింది.


Click it and Unblock the Notifications








