ముడి సరుకుల ధరల పెరగడంతో నష్టపోయిన కంపెనీలు

ఈ ఆర్థిక సంవత్సరంలో నష్టాలు రావడానికి ముఖ్యంగా.. దిగుమతి సుంకం, ముడి పదార్థాల ధరల పెరుగదలే కారణమని, ఈ పెంపు ఫలితంగా వల్ల కంపెనీ రూ. 126 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ విక్రయాలు 34.1 శాతం వృద్ధి చెంది రూ. 5,118.19 కోట్ల నికర అమ్మకాలు జరిగాయని గతేడాది ఇదే సమయంలో కంపెనీ నికర అమ్మకాలు రూ. 3,814.4 కోట్లుగా ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా.. మరో ప్రముఖ ఆటోమబైల్ సంస్థ అశోక్ లేల్యాండ్ ఈ ఏడాది జనవరి విక్రయాలలో నిరాశజనక ఫలితాలను ప్రకటించింది. ఈ నెలలో కంపెనీ విక్రయాలు రెండు శాకం క్షీణించి 7,711 యూనిట్లకు పడిపోయినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ విక్రయాలు 7,871 యూనిట్లుగా ఉన్నాయి. కాగా.. ఈ జనవరి విక్రయాలలో 6,880 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించగా.. గత జనవరిలో 7,460 యూనిట్లను విక్రయించింది. కానీ ఎగుమతుల్లో మాత్రం పెరుగదలను కనబరిచింది. ఈ జనవరిలో 831 యూనిట్లను విక్రయించగా.. గత జనవరిలో 411 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది.


Click it and Unblock the Notifications








