డీజిల్ కార్ల యజమానులపై ప్రభుత్వం కొరడా!

"మీ (ప్రతిపక్షాల) సలాహాలను మేము అంగీకరిస్తాం మరియు ఈ సెక్షన్లో (డీజిల్ కార్ల యజమానుల) సబ్సిడిలను ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తామ"ని ధరల పెరుగుదల అంశంపై లోక్ సభలో ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్యాసింజర్ కార్లకు ఉపయోగించే ప్రతి లీటర్ డీజిల్పై ప్రభుత్వం రూ. 6.08 సబ్సిడిని ఇస్తోంది. దేశానికి అవసరమయ్యే మొత్తం క్రూడ్ ఆయిల్లో దాదాపు 75 శాతం చమురును మనం దిగుమతి చేసుకోవడం జరుగుతోంది.
ఈ మొత్తంలో 10 శాతం డీజిల్ను పరిశ్రమలు ఉపయోగిస్తుండగా, రైల్వే సెక్టార్ 6 శాతం డీజిల్ను, వ్యవసాయ రంగం 12 శాతం డీజిల్ను వినియోగిస్తోంది. అయితే, అత్యధికంగా కార్ల యజమానులే 15 శాతం డీజిల్ను వినియోగిస్తున్నారని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కోసం 8 శాతం, బస్సులు 12 శాతం, ట్రక్కులు 37 శాతం డీజిల్ను ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రణబ్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే.. త్వరలోనే డీజిల్ కూడా మరింత ప్రియమయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








