ఫోర్స్ మోటార్స్, డైమ్లర్ ఏజిల జేవీ నుంచి ఎమ్పివి!

ఇప్పటివరకూ టెంపో ట్రావెలర్, ట్రాక్స్ క్రూయిజర్, ట్రాక్టర్ వంటి వాణిజ్య వాహనాలు రూపొందిస్తున్న ఫోర్స్ మోటార్స్ తొలిసారిగా ప్యాసింజర్ వాహన విభాగంలోకి ప్రవేశించాలని సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్ కోసం ఓ ఎమ్పివి రూపొందించేందుకు డైమ్లర్ ఏజితో ఫోర్స్ మోటార్స్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఫోర్స్ మోటార్స్ అభివృద్ధి చేస్తున్న ఎమ్పివికి కావల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మద్దతును డైమ్లర్ ఏజి అందించాల్సి ఉంటుంది.
ఈ జాయింట్ వెంచర్ ద్వారా అభివృద్ధి చేయబడుతున్న ఫోర్స్ మోటార్స్ ఎమ్పివి 2012 చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంచితే.. ఫోర్స్ మోటార్స్ తన స్వంత టెక్నాలజీతో మరొక ఎస్యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాన్ని)ను వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఫోర్స్ మోటార్స్ నుంచి రెండు ప్యాసింజర్ వాహనాలు భారత మార్కెట్లోకి విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications