రెండో ప్లాంటు ఏర్పాటుకు గుజరాత్‌ను ఎన్నుకున్న ఫోర్డ్

Ford plant near Nano plant
గుజరాత్‌లో ప్లాంటు ఏర్పాటు చేయాలనుకున్న అమెరికా ఆటో దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ కల నేటితో నిజయమైంది. భారత్‌లో తన కార్యకలాపాల విస్తరణ కోసం ఫోర్డ్ ఎట్టకేలకు గుజరాత్‌ రాష్ట్రాన్ని ఎన్నుకుంది. ఈ మేరకు నేడు మోడీ సర్కారుతో భేటీ అయిన ఫోర్డ్ ఉన్నాతాధికారుల బృందం తమ భవిష్యత్ కార్యాచరణల గురించి వెల్లడించారు. గుజరాత్‌లో ఓ కార్ల తయారీ ప్లాంటును మరియు ఇంజన్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేయనున్నామని సమావేశం అధికారులు తెలిపారు.

ఈ మేరకు గుజరాత్‌ ప్రభుత్వంతో ఫోర్డ్ ఇండియా ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టాటా మోటార్స్ చిన్న కారు నానో ప్లాంటు సరసనే ఫోర్డ్ కూడా తన రెండో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. అహ్మదాబాద్ టౌన్‌కు 30 కి.మీ. దూరంలో ఉన్న సనంద్‌లో రూ. 4,000 కోట్లు (100 కోట్ల అమెరికన్ డాలర్ల) పెట్టుబడితో ఫోర్డ్ ఈ ప్లాంటును నిర్మించనుంది. 1995లో చెన్నైలో ప్లాంటు ఏర్పాటు ద్వారా భారత్‌లోకి ప్రవేశించిన ఫోర్డ్ తాజా పెట్టుబడితో కలిపి 200 కోట్ల డాలర్లకు చేరింది.

సనంద్‌లో 460 ఏకరాలకు పైగా స్థలంలో ఫోర్డ్ స్థాపించనున్న తన రెండో ప్లాంటులో ప్రారంభంగా సాలీనా 2.40 లక్షల కార్ల ఉత్పత్తిని మరియు 2.70 లక్షల ఇంజన్‌ల ఉత్పత్తిని చేపట్టనుంది. గుజరాత్ ప్రభుత్వంతో కుదిరిన సహకార ఒప్పందం (ఎమ్ఓయూ)లో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలను మాత్రం ఫోర్డ్ వెల్లడించడానికి నిరాకరించింది.

More from DriveSpark

Article Published On: Thursday, July 28, 2011, 17:22 [IST]
English summary
Gujarat, more particularly Sanand appears to be attracting carmakers very successfully. Ford India has confirmed that it would be investing $1 billion (More than Rs.4,000) to build its second plant in India. Ford has virtually doubled its investment in India to $2 billion through its plant in Gujarat. Ford's plant will now be the neighbor of Tata Motors' Nano plant in Sanand.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+