డీజిల్ ఫ్లాట్‌ఫామ్ కార్లపై మరింత విశాల దృష్టి: ఫోర్డ్ ఇండియా

Ford Figo
పెట్రోల్ ధరలు నానాటికీ పెరిగి పోతుండటంతో డీజిల్‌తో నడిచే కార్లపై ఫోర్డ్ ఇండియా విశాల దృష్టి సారించనున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో డీజిల్ ఫ్లాట్‌ఫామ్‌పై మరిన్ని మోడళ్లను దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టాలని కంపెనీ భవిస్తోంది. పెట్రోల్ ధరలు పెరిగుతున్నందు వల్ల వినియోగదారులు డీజిల్‌ మోడల్ కార్లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని ఫోర్డ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నైగెల్‌ వార్క్‌ తెలిపారు. ఈ దశాబ్దపు మధ్య భాగం నాటికి ఫోర్డ్ ఇండియా 8 కొత్త ఉత్పత్తులను భారత్‌కు పరిచయం చేయనుందని ఆయన చెప్పారు.

రానున్న ఉత్పత్తులన్నీ ముఖ్యంగా ప్లాట్‌ఫామ్‌పైనే ఉంటాయని, అయితే డీజిల్‌ కార్లను తయారు చేయడం ఎంతో శ్రమతో కూడుకున్నదని, ఇది సంస్థపై ఒత్తిడిని తెస్తుందని వార్క్ తెలిపారు. గతేడాదిలో తాము 83,000 యూనిట్లు విక్రయించామని, ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటికే 58,000 యూనిట్లు విక్రయించినట్లు ఆయన వివరించారు. ఈ ఏడాది ఖచ్చితంగా లక్ష కార్ల మార్కును చేరుకుంటామని వార్క్ ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమ కన్నా వేగంగా ఫోర్డ్ ఇండియా విస్తరణ కార్యక్రమాలు చేపడుతుందని, ప్రస్తుతం భారత ఆటోమొబైల్ పరిశ్రమ 17 శాతం చొప్పున పెరుగుతోందని ఆయన అన్నారు. ఫోర్డ్‌ కార్ల అమ్మకాలలో ఎక్కువ భాగం చిన్న కార్లే ఉన్నాయి. ఫోర్డ్ ముద్దుల కారు ఫిగో 50 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు వార్క్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Thursday, June 30, 2011, 11:59 [IST]
English summary
US carmaker Ford's 100% Indian subsidiary Ford India will largely focus on diesel-run cars for future launches. "Petrol prices are becoming high and this has swung the proportion of cars sold in favour of diesel models," Ford India Executive Director Nigel Wark said.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+