మరో నాలుగేళ్లలో ఫోర్డ్ ఇండియా నుంచి 8 కొత్త మోడళ్లు

ఫోర్డ్ ఇండియా 2011 సంవత్సరం చాలా అద్భుతంగా ప్రారంభమైందనే చెప్పాలి. ఏడాది తొలి నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా నెలవారీ విక్రయాలు (10,000 కార్లకు పైగా..) రికార్డు స్థాయిలోనమోదయ్యాయి. ప్రస్తుతం భారత మార్కెట్లో ఎనిమిది మోడళ్లను పరిచయం చేసే అంశంపై దృష్టి సారించామని ఫోర్డ్ ఇండియా ఉపాధ్యక్షుడు అనురాగ్ మెహరోత్రా వెల్లడించారు. దీంతోపాటు తమ డీలర్షిప్ నెట్వర్క్ను కూడా దేశవ్యాప్తంగా విస్తరించుకోనున్నామని, ప్రస్తుతం ఉన్న 170 డీలర్లకు అదనంగా మరో 30 డీలర్లను నియమించనున్నట్లు ఆయన తెలిపారు.
గతేడాది (2010)లో కంపెనీ 83,887 యూనిట్లను విక్రయించి 2009తో పోలిస్తే.. దాదాపు మూడింతల వృద్ధిని సాధించింది. 2009లో కంపెనీ కేవలం 29,488 కార్లను మాత్రమే విక్రయించింది. గత 15 ఏళ్లుగా కంపెనీ విక్రయాలలో ఇంత అధిక వృద్ధిని నమోదు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఒక్క జనవరిలోనే ఫోర్డ్ ఇండియా 10,026 యూనిట్లకు విక్రయించగా.. 2010 జనవరిలో 2,453 యూనిట్లు మాత్రమే ఉన్నట్లు ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








