భారత్లో ఫ్రీల్యాండర్ కారు అసెంబ్లింగ్కు టాటా ప్రయత్నాలు

ఒక్క ఏడాది కాలంలోనే భారత మార్కెట్లో జాగ్వార్ ల్యాండ్ రోవర్కు వచ్చిన అనూహ్య స్పందనను దృష్టిలో ఉంచుకొని టాటా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్రీల్యాండర్ వెర్షన్ ఇకపై భారత్లోనే లభించనుందని కంపెనీ పేర్కొంది. భారత్లో ఇప్పటి వరకూ టాటా మోటార్స్ 200 ల్యాండ్ రోవర్ మోడళ్లను విక్రయించింది. దీంతో ప్రస్తుతం మార్కెట్ షేర్ను, మార్జిన్లు పెంచుకోవడంపై కంపెనీ దృష్టిపెట్టింది. ల్యాండ్ రోవర్ ఉత్పత్తులకు చైనా తర్వాత భారత మార్కెటే తమకు అత్యంత పటిష్టమైన మార్కెట్ అని జాగ్వార్ ల్యాండ్ రోవర్ తెలిపింది.


Click it and Unblock the Notifications








