అరటి, అనాస పండ్లతో కార్ల తయారీ..: బ్రెజిల్ శాస్త్రవేత్తల ప్రయోగం

నానోసెల్యులోజ్గా పిలువబడే ఈ ఫైబర్ తక్కువ బరువును కలిగి ఉండి అధిక ధృడత్వాన్ని ఇస్తుంది. ఈ పరిశోధనలకు నాయకత్వం వహిస్తున్న ఎల్సిడిస్ లియో మాట్లాడుతూ ఫైబర్ను రేయిన్ఫోర్స్గా వినియోగిస్తారని, తాము అభివృద్ధి చేస్తున్న ప్లాస్టిక్స్ను అరటి, పైనాపిల్ వంటి పండ్ల నుండి తయారు చేస్తారని చెప్పారు. ఈ ప్లాస్టిక్స్ వేడి, గ్యాసోలైన్, నీరు వంటి వాటిని తట్టుకోగలదని, కారు డ్యాష్బోర్డ్స్, బంపర్స్, కొన్ని బాడీ ప్యానెల్స్ తయారీకి ఈ ఫైబర్ను ఉపయోగించవచ్చునని ఆయన చెప్పారు.
రానున్న రెండేళ్లలో ఈ ఫైబర్ను కార్ల తయారీకు ఉపయోగించనున్నామని వారు వెల్లడించారు. ఈ పరిశోధనకు సంబంధించిన అంశాన్ని అమెరికన్ కెమికల్ సొసైటీ (ఎసీఎస్) 241వ జాతీయ సమావేశాలు, ప్రతిపాదనల సందర్భంగా లియో వివరించారు.


Click it and Unblock the Notifications








