ధరల పెంపుపై అక్టోబర్ నాటికి నిర్ణయం: జనరల్ మోటార్స్

కాగా.. అక్టోబర్ 1 నుంచి తమ అన్ని రకాల ఉత్పత్తులపై 2 శాతం వరకూ ధరలను పెంచనున్నట్లు టొయెటా కిర్లోస్కర్ మోటార్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. "అక్టోబర్ 1 నుండి ధరలను 1.5 శాతం నుండి 2 శాతం మేర పెంచుతాం. పెరుగుతున్న విడిభాగాల ధరలు మరియు యెన్ (జపాన్ కరెన్సీ) విలువ పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణమ"ని టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (మార్కెటింగ్) సందీప్ సింగ్ తెలిపారు.
మరోవైపు తమ అన్ని రకాల ఉత్పత్తుల ధరలను 1.5 శాతం నుంచి 2 శాతం మేర పెంచుతున్నామని ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ - ఆటోమోటివ్ సెక్టార్) వివేక్ నాయర్ ప్రకటించారు.


Click it and Unblock the Notifications








