గ్లోబల్ కాన్సెప్ట్ కార్ను పరిచయం చేసిన మిత్సుబిషి

ఐదుగురు కూర్చుని హాయిగా ప్రయాణించ గల ఈ కారు అత్యంత ఇంధన సామర్థ్యం కలిగి ఉండి, పర్యావరణ సాన్నిహిత్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. దీని నుండి వెలువడే కర్బన వ్యర్థాలు 90 గ్రామలు/మైల్ మధ్యలో ఉంటాయని, ఇందుకోసం కారును అత్యంత తేలికంగా ఉండే పరికరాలతో రూపొందించామని మిత్సుబిషి పేర్కొంది.
ఇంకా..ఈ కారులో ఆటోమోటిక్ స్టార్ట్/స్టాప్ వ్యవస్థ కలిగి ఉంటుంది. దీని ఇంజన్ సామర్థ్యం 1.0-1.2 లీటర్లు. థాయ్లాండ్లో ఈ కారును విడుదల చేసిన తర్వాత భారత్లోకి కూడా దీనిని ప్రవేశపెట్టాలని మిత్సుబిషి యోచిస్తోంది. మిత్సుబిషి అందిస్తున్న ఉత్పత్తులు హై-ప్రొఫైల్ కలిగిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుండటంతో దేశీయ మార్కెట్లలో కంపెనీ పెద్దగా రాణించలేకపోతుంది. ప్రస్తుత వినియోగదారుల ట్రెండ్ చిన్న కార్లపై ఉండటంతో మిత్సుబిషి కూడా ఈ విభాగంపై కన్నేసింది.


Click it and Unblock the Notifications








