కొత్త ఉత్పత్తులు, సామర్థ్యాల పెంపు కోసం జిఎమ్ తాజా పెట్టుబడులు

వచ్చే రెండేళ్లలో తాలేగావ్ ప్లాంటులో తాము పెట్టబోయే కొత్త పెట్టుబడులతో కంపెనీ మొత్తం పెట్టుబడులు రూ. 2,200 కోట్లకు పైగా చేరుతాయని, తాజా పెట్టుబడులను కొత్త ఉత్పత్తుల కార్యకలాపాలకు మరియు మార్కెట్ డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేందుకు ఉపయోగిస్తామని జనరల్ మోటార్స్ ఇండియా (జిఎమ్ఐ) వైస్-ప్రెసిడెంట్ (కార్పోరేట్ ఆఫైర్స్) పి బాలేంద్రన్ వెల్లడించారు. ఇప్పటికే తాలేగావ్ ప్లాంటులో జిఎమ్ రూ. 1,800 కోట్ల పెట్టుబడులను వెచ్చించింది. ప్రస్తుతం ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం సాలీనా 1.4 లక్షల కార్లను మరియు 1.6 లక్షల పెట్రోల్, డీజిల్ ఇంజన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా ప్లాంటులో కంపెనీ అందిస్తున్న చిన్న కార్లయిన చెవర్లే బీట్, స్పార్క్ వంటి మోడళ్లు కూడా తయారవుతున్నాయి.


Click it and Unblock the Notifications








