ప్రభుత్వానికి అక్షయ పాత్ర.. దేశీయ ఆటో రంగం

అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2009-10)లో ఈ ఆదాయం రూ. 3,958 కోట్లుగా ఉన్నట్లు ఆయన వివరించారు. కాగా.. 2010-11 దేశీయ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో 30 శాతం వృద్ధి చెంది 2 మిలియన్లుగా నమోదయ్యాయి, అలాగే ఉత్పత్తి కూడా 27 శాతం పెరిగి 2.45 మిలియన్లుగా నమోదయ్యింది. కేంద్ర బడ్జెట్ 2010-11లో ప్రభుత్వం సుంఖాన్ని కేవలం 2 శాతం మేర మాత్రమే పెంచినప్పటికీ ఎక్సైజు సుంఖం ద్వారా ఇంత భారీ స్థాయిలో ఆదాయాలు రావడం గమనార్హం.
ప్రస్తుతం చిన్న కార్లపై ఎక్సైజ్ సుంఖం 10 శాతం గానూ, పెద్ద కార్లపై 22 శాతం గానూ ఉంది. ఏదేమైనప్పటికీ, 2010-11 ఆర్థిక సంవత్సరంలో వాహన ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం మాత్రం కేవలం 5 శాతం మాత్రమే వృద్ధి చెంది అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2009-10)తో పోలిస్తే రూ. 14,482 కోట్ల నుంచి రూ. 15,276 కోట్లకు పెరిగింది.


Click it and Unblock the Notifications








