ఇంధన బాదుడుకు రంగం సిద్ధం.. త్వరలోనే వడ్డింపు..!!

Fuel Price Hike
ప్రభుత్వరంగ చమురు సంస్థలు సబ్సిడి ధరకే పెట్రో ఉత్పత్తులను విక్రయిస్తుంటం వలన ప్రతి రోజు రూ.333 కోట్లను నష్టపోతున్నట్లు పేర్కొంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలను సుమారు రెండు రూపాయల మేర పెంచాలని చమురు కంపెనీలు యోచిస్తుండగా, మరోవైపు డీజిల్‌, ఎల్‌పిజి (వంట గ్యాస్‌) కిరోసిన్‌ ధరలు కూడా సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ మేరకు త్వరలోనే మంత్రుల సాధికారిక కమిటీని ఏర్పాటు చేసి డీజిల్‌, ఎల్‌పిజి మరియు కిరోసిన్‌ ధరలు సవరించాలని పెట్రోలియం శాఖ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖమంత్రి ప్రణబ్‌ ముఖర్జీని కోరినట్లు తెలిపారు. ప్రస్తుతం చమురు సంస్థలు ప్రతి లీటర్ డీజిల్‌ విక్రయంపై రూ.9.27, ప్రతి టరు కిరోసిన్‌పై రూ.26.94 మరియు ప్రభుత్వ సబ్సిడి ద్వారా సరఫరా చేసే ఎల్‌పిజిపై రూ.260.50 చొప్పున నష్టపోతున్నాయి.

వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితేనే దేశీయ మార్కెట్లో చమురు ధరలు కూడా పెంచాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుత పరిస్థితిలో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, రూపాయి విలువతో పోల్చుకుంటే డాలర్‌ విలువ ఎక్కువగా ఉండటంతో పెట్రోల్ ధర పెంచి తీరాల్సిందేనని చమురు సంస్థలు పట్టపడుతున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, November 3, 2011, 10:34 [IST]
English summary
Indian Oil minister S Jaipal Reddy, hopes a ministerial panel to review the fuel prices, which were sold at subsidized rates. India subsidies retail prices of diesel, kerosene and cooking gas but petrol prices were liberalized over a year ago.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+