సమ్మె కారణంగా 850 యూనిట్ల ఉత్పత్తి నష్టపోయిన జిఎమ్

General Mortors
గుజరాత్‌లోని హలోల్‌లో ఉన్న జనరల్ మోటార్స్ ఇండియా ప్లాంటులో యాజమాన్యాన్నికి వర్కర్ల మధ్య తలెత్తిన నేటితో 14వ రోజుకు చేరుకుంది. ఫలితంగా జనరల్ మోటార్స్ ఇప్పటి వరకూ 850 వాహనాల ఉత్పత్తిని కోల్పోయినట్లు ప్రకటించింది. ఈ నెల 16 నుంచి గుజరాత్‌లోని హలోల్ ప్లాంటులోని కార్మికులు సమ్మె చేపట్టారు. కొంతమంది ఉద్యోగులను డీలర్‌షిప్ అవుట్‌లెట్లకు బదిలీ చేయడానికి నిరసనగా, అలాగే గత ఏడాది డిసెంబర్‌లో కుదిరిన దీర్ఘకాలిక వేతన ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.

దీంతో సదరు వర్కర్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తమ న్యాయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఇప్పటికే క్రమశిక్షణా చర్యలు చేపట్టామని జనరల్ మోటార్స్ ఉపాధ్యక్షుడు పి బాలేంద్రన్ వెల్లడించారు. మార్చి 25లోగా తిరిగి విధుల్లోకి రాకపోతే.. ఉద్యోగం నుంచి తీసేస్తామని సమ్మె చేస్తున్న 250 వర్కర్లకు కంపెనీ అల్టిమేటం జారీ చేసింది. అయితే వర్కర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇందుకు మరికొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు.

హలోల్ ప్లాంటులో మొత్తం 900 మంది కార్మికులు ఉండగా.. 250 మంది ఇప్పటికీ గైర్హాజరీలో ఉన్నారని, ప్రస్తుతం ఒకే షిఫ్టు కింద ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. గతంలో రోజుకి 190 కార్లను ఉత్పత్తి చేసే ప్లాంటులో సమ్మె వల్ల ఇప్పుడు దాదాపు 100 యూనిట్లు మాత్రమే తయారవుతున్నాయని ఆయన వివరించారు. ఈ ఫ్యాక్టరీలో ఏటా 85,000 కార్లను ఉత్పత్తి చేసే సామార్థ్యం వుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, March 30, 2011, 14:48 [IST]
English summary
The stalemate between striking workers and management of General Motors (GM) India continues for 14th day at the Halol facility in Gujarat, with the car maker incurring production loss of about 850 vehicles so far.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+