స్కూటర్ల ఉత్పత్తిని రెట్టింపు చేయనున్న హీరో మోటోకార్ప్

ప్రస్తుతానికి స్కూటర్లు గుర్గావ్ ప్లాంటులో మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో హరిద్వార్ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని 8,000 యూనిట్ల నుండి 9,500 యూనిట్లకు పెంచనున్నట్లు కంపెనీ సిఎఫ్ఓ రవి సూద్ వెల్లడించారు. కంపెనీ మొత్తం అమ్మకాలలో 95 శాతం బైక్ల ద్వారా వస్తున్నాయని, వాటిలో స్ప్లెండర్, ప్యాషన్ బ్రాండ్లే అధికంగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.
గడచిన ఆగస్టు నెలలో లండన్లో తమ బ్రాండ్ లోగో ఆవిష్కరణ సందర్భంగా విడుదల చేసిన 110 సీసీ స్కూటర్ మాస్ట్రోను త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నామని, ఇప్పటికే 150సీసీ డ్యూయెల్ పర్సప్ మోటార్సైకిల్ ఇంపల్స్ను విడుదల చేశామని కంపెనీ వివరించింది. భారత మార్కెట్లో హీరో ఇంపల్స్ మోటార్సైకిల్ ధర రూ.66,800 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.


Click it and Unblock the Notifications








