మారుతి సుజుకి మనేసర్ ప్లాంట్లో ఉత్పత్తికి ఢోకా లేదు

ఈ ప్లాంట్లో 2,500 మంది కార్మికులు, పనిచేస్తున్నారు. వారిలో 950 మంది పర్మినెంట్ ఉద్యోగులు. ఎంఎస్ఐ యాజమాన్యం, కార్మికుల మధ్య ఆగస్టు 29వ తేదీనుంచి వివాదం కొనసాగుతోంది. కార్మికులు కావాలనే పనికి ఆటంకం కలిగిస్తూ, క్వాలిటీలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని యాజమాన్యం వారిని పనిలోనికి రానివ్వలేదు. గుడ్ కాండెక్ట్ బాండ్పై సంతకం చేస్తేనే పనిలోనికి రానిస్తామని షరతు విధించింది. దీనికి కార్మికులు ససేమిరా అనడంతో వివాదం కొనసాగుతోంది. జూన్లో 13 రోజుల పాటు చేసిన సమ్మెకు యజామాన్యం ఇప్పుడు కక్ష తీర్చుకుంటుందని కార్మికులు అంటున్నారు.
వీరితో పాటు 90 మంది ఇంజినీర్లను మనేసర్ ప్లాంట్లో కొరకు తీసుకున్నామని ఎంఎస్ఐ తెలిపింది. ప్రస్తుతం మనేసర్ ప్లాంట్ మొత్తం 1,300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్త కార్మికులు ఉద్యోగంలో చేరడంతో యాజమాన్యం నూతన ఉత్సాహంతో కొత్త ఎంట్రీ లెవెల్ సీడాన్ డీజైర్, కొత్త స్విఫ్ట్ల ఉత్పత్తి పెంచాలని యోచిస్తోంది. కొత్త డీజైర్ కార్ల ట్రయిల్ ఉత్పత్తిని ప్రారంభించింది. మనేసర్ ప్లాంట్లో సరాసరి 1,200 స్విఫ్ట్లు, ఎ-స్టార్, ఎస్ 4 ప్రతి రోజు ఉత్పత్తి అవుతున్నాయి.


Click it and Unblock the Notifications








