రెండు వేదికలలో ఢిల్లీ ఆటో ఎక్స్పో 2011

ఆటో ఎక్స్పో 2011లో పాల్గొనేందుకు స్థలం కోసం ఇలా అంతర్జాతీ సంస్థలు కూడా భారీగా పోటీ పడుతుండటం చూస్తుంటే.. ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆటో కంపెనీలకు భారత మార్కెట్ ఎంత ప్రాధాన్యత కలిగిన మార్కెటో అర్థమవుతుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ ప్రగతి మైదాన్లో 10 సార్లు ఇలాంటి ఆటో ఎక్స్పోలు నిర్వహించినప్పటికీ, ఎన్నడూ ఇంత భారీ స్పందన లభించలేదని ఒక్క వారంలోనే ఈ ప్రదర్శనకు కేటాయించిన స్థలాలన్నీ అమ్ముడైపోయాయని ఆయన చెప్పారు.
మొత్తం 55 వేల చదరపు మీటర్ల విస్తీర్ణాన్ని వివిధ ఆటోమొబైల్ కంపెనీలు రిజర్వ్ చేసుకున్నాయని, ఇంకా 33 నుంచి 35 వేల చదరపు మీటర్లకు డిమాండ్ వుందని విష్ణు పేర్కొన్నారు. వచ్చే ఏడాది తొలి నెలలో జరగబోయే ఈ ఆటో ప్రదర్శనకు దాదాపు 20 లక్షల మంది ప్రజలు హాజరు కావచ్చని, అలాగే 35 కొత్త వాహనాలు కూడా ఆవిష్కరణ జరిగే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. కాగా.. ఈ ప్రదర్శనకు రెండో వేదికను నోయిడాలోని ఎక్స్పో మార్ట్ మైదానాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications








