2020 నాటికి ప్రపంచపు 3వ అతిపెద్ద తేలిక వాహనాల మార్కెట్గా భారత్

జెడి పవర్ రూపొందించిన 'ఇండియన్ ఆటోమోటివ్ 2020: ది నెక్స్ట్ గెయింట్ ఫ్రమ్ ఆసియా' అనే నివేదికలో ప్రస్తుతం ఆరవ స్థానంలో ఉన్న భారత్, 2020 నాటికి చైనా అమరికా దేశాల సరసన చేరుతుందని, ఆ సమయానికి దేశీయ మొత్తం విక్రయాలు 11.9 మిలియన్ల లైట్ వెహికల్స్గా ఉంటాయని వెల్లడించింది. 2010లో 2.7 మిలియన్ల లైట్ వెహికల్స్ అమ్ముడయ్యాయి. 2000 సంవత్సరంలో ఇవి కేవలం ఏడు లక్షలు మాత్రమే ఉన్నట్లు ఆ నివేదిక పేర్కొంది.
అలాగే 2020 నాటికి చైనా లైట్ వెహికల్ మార్కెట్ 35 మిలియన్లకు పెరుగుతుందని, ఇదే సమయంలో అమెరికా మార్కెట్ 17.4 మిలియన్లను తాకుతుందని జెడి పవర్ అంచనా వేసింది. భారత మార్కెట్లో భారీ అవకాశాలు ఉన్నాయని, కానీ ఈ వృద్ధి రేటును చేరుకోవడానికి దేశ మౌలికరంగం కీలక సవాల్గా మారుతుందని జెడి పవర్ ఆసియా పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మోహిత్ అరోరా తెలిపారు. దేశంలో విడిభాగాల సరఫరా మెరుగుపడాలని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications








