మిత్సుబిషి అభివృద్ధికి భారత్, బ్రెజిల్లు రెండు కీలక మార్కెట్లు

జపాన్ కు చెందిన ఆటోమొబైల్ సంస్థ మిత్సుబిషి కూడా ఆ కంపెనీలను ఆదర్శంగా తీసుకొని భారత్, బ్రెజిల్ దేశాలలో తమదైన ముద్ర వేసుకోవాలని భావిస్తుంది. దీనిలో భాగంగా మిత్సుబిషి తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సన్నాహాలు చేస్తుంది. ఇందుకు కోసం ఉత్పత్తిని ఔట్సోర్సింగ్ చేయడానికి ఫ్రాన్స్ కు చెందిన ఓ సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకునే పనిలో ఉంది. ఇంకా.. నిస్సాన్ తో జాయింట్ వెంటర్గా ఏర్పడి తక్కువ ధర కలిగిన వాహనాల (చిన్న కార్ల)ను ఉత్పత్తి చేసే అంశంపై కూడా మిత్సుబిషి చర్చలు జరుపుతోంది.
అంతే కాకుండా.. అమెరికా, యూరప్ మార్కెట్ల కోసం ప్రత్యేకించి కొన్ని వాహనాలను మిత్సుబిషి రూపొందిస్తుంది. పంపిణీ ప్రక్రియ ద్వారా తమ ప్రపంచస్థాయి ఉత్పత్తిని 15 లక్షల యూనిట్లకు పెంచుకోవడమే మిత్సుబిషి ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం మిత్సుబిషి 241.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను వెచ్చించి ఎమ్ఎన్సి ఆటోమోటార్స్, బ్రసిల్ ఎస్ఏ (మిత్సుబిషి వాహనాల ఉత్పత్తిలో భాగంగా ఉన్న ఓ బ్రెజిల్ కంపెనీ)లలో 50 వాటాలను ఆక్రమించుకోనుంది. ఈ విస్తరణ ప్రణాళికతో కంపెనీ సంవత్సరానికి కనీసం ఒక లక్ష కార్లను తయారు చేయవచ్చని అంచనా వేస్తుంది.


Click it and Unblock the Notifications








