ఆటో రంగంలో అమెరికాను ఓవర్టేక్ చేయనున్న భారత్

ఈ నేపథ్యంలో రానున్న 25 ఏళ్లలో ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న అమెరికాను, తర్వాతి స్థానంలో ఉన్న చైనా దేశాలను భారత్ అధిగమించగలదని బూజ్ అండ్ ఆంప్ అనే విశ్లేషణ కంపెనీ నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. 2020 నాటికి దేశీయ వార్షిక వాహన విక్రయాల సంఖ్య రెండింతల వృద్ధితో 50-60 లక్షలకు పెరగనవచ్చునని కంపెనీ తెలిపింది. ఈ దశాబ్దం మధ్య భాగంలో ఉత్పత్తిపై ఆటో హబ్ దృష్టిసారించడాన్నిబట్టి అంచనా వేస్తే.. అమెరికాను భారత్ అధిగమిస్తున్న విషయం అర్థమవుతుందని కంపెనీ పేర్కొంది. మరో దశాబ్ధంలో ఆమెరికా ఆటో విక్రయాల సంఖ్య తగ్గిపోవచ్చునని, అప్పటికి భారత్ 200 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించి అమెరికాకు ధీటుగా నిలబడగలదని ఆ సర్వే అంచనా వేసింది.


Click it and Unblock the Notifications








