భారత కార్ విక్రయాలు తగ్గుతాయిస కానీ ఫోక్స్వ్యాగన్వి తగ్గవు

గడచిన సంవత్సరంలో ఫోక్స్వ్యాగన్ భారత మార్కెట్లో 32,500 కార్లను విక్రయించగా, ప్రస్తుత సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే కంపెనీ విక్రయాలు 39,366 యూనిట్లకు చేరుకున్నాయి. అంటే 2010లో భారత్ మార్కెట్లో ఏడాది పాటు సాధించిన వృద్ధిని 2011లో ఆరు నెలల్లోనే కంపెనీ సాధించగలిగింది. కాగా.. మిగిలిన ఆరు నెలల్లో తమ కంపెనీ ఇదే విధమైన వృద్ధిని సాధించగలదా? అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. దీన్ని అంచనా వేయడం క్లిష్టతరమని, ప్రస్తుతం పరిశ్రమ నెమ్మిదించిందని తెలిపారు. పటిష్టమైన వినియోగదారులు కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఫలితంగా బుకింగ్లు తగ్గాయని ఆయన చెప్పారు.
అంతేకాకుండా.. కంపెనీ తన కొత్త మోడల్ జెట్టాను త్వరలో విడుదల చేయనుంది. ఇప్పటికే పస్సాట్ను విడదల చేశామని, మరికొద్ది నెలల్లో జెట్టాను విడుదల చేస్తామని ఆయన తెలిపారు. అలాగే, పెరిగిన పెట్రోల్ ధరల నేపథ్యంలో పెట్రోల్ ఇంజన్ వేరియంట్ల నుంచి కొనుగోలుదారులు డీజిల్ ఇంజన్ వేరియంట్ మోడళ్ల వైపు మొగ్గుచూపుతుండటాన్ని ఫోక్స్వ్యాగన్ కళ్లజూసింది. గతేడాది మొత్తం ఫోక్స్వ్యాగన్ పోలో విక్రయాల్లో 62-63 శాతం కొనుగోలుదారులు పెట్రోల్ మోడళ్లను ఆశ్రయిస్తే, ఈ ఏడాది 50 శాతం మాత్రమే పెట్రోల్ మోడళ్లను కొనుగోలు చేశారని, వెంటో మోడల్ పరిస్థితి కూడా ఇలానే ఉందని గార్గ్ తెలిపారు.


Click it and Unblock the Notifications








