ఇక బెంజ్ బస్సులలో విహార యాత్రలు, దేవుని దర్శనం

ఎపిటిడిసి కొనుగోలు చేసిన ఈ 8 మెర్సిడెస్ బెంజ్, 8 వోల్వో బస్సులు ప్రధానంగా ఆద్యాత్మిక కేంద్రాలైన షిరిడీ, తిరుపతి మార్గాల్లో పర్యాటకులకు అందు బాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రధాన పర్యాటక ప్రాంతీయ అనేక మార్గాల్లో బస్సులు నడుపుతూ పర్యాటకుల ఆదరాభిమా నాలు పొందుతున్న ఎపిటిడిసి కొత్తగా కొనుగోలు చేసిన ఈ బ స్సులలో మరికొంత శోభను సంతరించుకోనుంది. ఎపిటిడిసి కొనుగోలు చేస్తున్న ఈ టూరిస్టు బస్సుల ప్రత్యేకత ముఖ్యంగా పర్యాటకరంగంలో దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెడు తున్న ఈ మెర్సిడెస్ బెంజ్ బస్సులు ప్రయాణం సుఖవంతంగా ఉంచుతాయి. ఎపిటిడిసి కేవలం ఆంధ్ర ప్రదేశ్ కొరకు దేశంలో ని అన్ని క్షేత్రాల పర్యాటక ప్రాంతాలకు అన్ని మార్గాల్లో రోడ్డు, రైల్ కమ్ రోడ్ ఉన్న మార్గాల్లో తగిన బస్సు సర్వీసులను నడుపుతోంది.


Click it and Unblock the Notifications








