స్పేర్స్ను అధిక ధరలకు విక్రయిస్తున్న కంపెనీలపై సీసీఐ నిఘా

మార్కెట్ పొజిషన్ను డామినేట్ చేసేందుకు సదరు కంపెనీలు తమ బ్రాండ్ల విడిభాగాలను నేరుగా అధీకృత డీలర్ల ద్వారా అధిక ధరలకు విక్రయిస్తుండటంతో వినియోగదారులకు మరో మార్గం లేక అధిక ధర వెచ్చించి మరీ కొనుగోలు చేయాల్సి వస్తుంది. సాధారణంగా దేశీయ కార్ల కంపెనీల విడిభాగాలు దాదాపు అన్ని రీటైల్ దుకాణాల్లో లభ్యమవుతాయి, కానీ ఇటువంటి విదేశీ కంపెనీ కార్ల విడిభాగాలు మాత్రం కంపెనీ అధీకృత డీలర్ల వద్ద మాత్రమే లభిస్తాయి. దీంతో సదరు డీలర్లు, తయారీదారులు విడిభాగాలను అధిక ధరలకు విక్రయించి వినియోగదారుల జేబులు కొల్లగొడుతున్నారు.
కాగా.. ఈ ఆరోపణలపై 45 రోజుల్లోగా దర్యాప్తు పూర్తిచేసి ఓ నివేదికను అందజేయాలని డైరక్టర్ జనరల్ను సీసీఐ ఆదేశించింది. అంతర్జాతీయ తయారీదారుల నుంచి కార్లను కొనుగోలు చేసిన వినియోగదారుల స్పేర్ల కొరత కారణంగా సమస్యలను ఎదుర్కుంటున్నారని కాంపిటీషన్ చట్టం 2002లోని సెక్షన్ 4 క్రింద ఓ కేసును ఫైల్ చేశాడు. కాగా.. ఈ అంశంపై స్పందించేందుకు హ్యుందాయ్ మోటార్స్ నిరాకరించగా.. వోక్స్వ్యాగన్, హోండా కంపెనీలకు పంపిన ఈ-మెయిల్స్కు ఇంత వరకూ సమాధానం అందలేదని సీఐఐ పేర్కొంది.


Click it and Unblock the Notifications








