థర్డ్-పార్టీ మోటార్ బీమా ప్రీమియంలు 70 శాతం పెంచిన ఐఆర్డీఏ

ఇక నుంచి థర్డ్-పార్టీ మోటార్ బీమా ప్రీమియంలను ప్రతి ఏడాది సమీక్షించడం జరుగుతుంది. క్లెయిమ్ సెటిల్మెంట్ తేదీ, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రీమియంలను సవరించడానికి ఐఆర్డీఏ ఒక సూత్రాన్ని కూడా తయారు చేసింది. ప్రస్తుతం ప్రీమియం రేట్లను ఐఆర్డీఏకు చెందిన టారిఫ్ సలహా కమిటీ నిర్ణయిస్తోంది.
1000 సీసీ కన్నా సామర్థ్యం మోటార్ కార్ల థర్డ్-పార్టీ వాహన బీమా ప్రీమియం ఇక నుంచి రూ. 740 చెల్లించాలి. (గతంలో ఇది రూ. 672గా ఉండేది). అలాగే.. 1000-1500 సీసీ కార్ల ప్రీమియం రూ. 800 నుంచ్ రూ. 880కు పెరిగింది. ఇకపోతే 1500 సీసీ మించిన కార్లకు ప్రిమీయం రుసుము రూ. 2,750కు పెరిగింది.
ద్విచక్ర వాహన విషయాలకు వస్తే.. 350 సీసీ వరకు ఉండే ద్విచక్ర వాహనాల ప్రీమియం 10 శాతం పెరిగి రూ. 330కు చేరుకుంది. అలాగే.. 350 సీసీకు మించిన టూవీలర్ వాహనాల ప్రీమియం రుసుము రూ. 680ను వసూలు చేస్తారు.
ఇక వాణిజ్య వాహన యజమానుల విషయానికి వస్తే.. వాహన మొత్తం బరువు 7500 కేజీల వరకూ ఉంటే ప్రిమీయంలో రూ. 5000 నుంచి రూ. 8420 వరకు పెంపు ఉంటుంది.
ఐఆర్డీఏ తన ఎక్స్పోజర్ ముసాయిదాలో ప్రైవేటు కార్లు, ద్విచక్ర వాహనాల ప్రీమియంలో 10 శాతం, రవాణా వాహనాలపై 80 శాతం వరకు పెంపును సిఫారసు చేసింది.


Click it and Unblock the Notifications








