దక్షిణ భారతదేశంలో రెండు కొత్త ప్లాంట్లు: జామ్నా ఆటో

Jamna Auto
ఆటోమొబైల్ పరికరాల తయారీ సంస్థ జామ్నా ఆటో మరో రెండు కొత్త యూనిట్లను నెకొల్పనున్నట్లు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఉత్పత్తి యూనిట్లను తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్, చెన్నయ్‌లలో నిర్మించనున్నామని, ఇందుకోసం రూ. 80 కోట్లను పెట్టుబడులగా వెచ్చించనున్నామని కంపెనీ పేర్కొంది. ఈ ప్లాంట్లలో వాణిజ్య వాహనాలకు అవసరమయ్యే విడిభాగాలను తయారు చేయనుంది. కాగా.. హోసూర్‌లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌లో ప్యారాబోలిక్ స్ప్రింగ్‌లను ఉత్పత్తి చేయనున్నామని, ఇది డిసెంబర్ 2011 నాటికి వినియోగంలోకి రాగలదని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

అలాగే చెన్నయ్‌లో ఏర్పాటు చేయనున్న ప్లాంటులో ఎయిర్ సస్పెన్షన్, బోగీ సస్పెన్షన్, లిఫ్ట్ యాక్సిల్స్‌లను తయారు చేయనున్నామని, ఈ ప్లాంటులో జులై 2011 నుంచి ఉత్పత్తి ప్రక్రియను చేపట్టవచ్చునని కంపెనీ తెలిపింది. డైమ్లర్ ఇండియా, రీనాల్ట్-నిస్సాన్, అశోక్ లేల్యాండ్, టాటా మోటార్స్ వంటి ప్రముఖ వాణిజ్య వాహన తయారీదారులకు జామ్నా ఆటో పరికరాలను సరఫరా చేస్తుంది. ఈ ప్రాంతాలలో ఆటో పరిశ్రమ బాగా వృద్ధి చెందడం కారణంగానే దక్షిణ భారతదేశంలో విస్తరణ పనులు చేపట్టామని జామ్నా ఆటో సీఈఓ రణదీప్ జవహర్ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, March 8, 2011, 15:29 [IST]
English summary
Auto component maker Jamna Auto today said it will set up two new manufacturing units at Hosur and Chennai to produce parts for commercial vehicles, entailing a total investment of Rs 80 crore. The Hosur facility is being set up to manufacture parabolic springs and the plant is expected to go on-stream in December 2011, the company said in a statement.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+