కొట్టుకుపోయిన నిస్సాన్ కార్లు, హోండా ప్లాంట్ల మూసివేత..!

ఈ ప్రకృతి భీబత్సం కారణంగా 2,300 కొత్త వాహనాలకు డ్యామేజ్ వాటిల్లినట్లు జపాన్కు చెందిన రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ప్రకటించింది. నాలుగు ఫ్యాక్టరీలు, రెండు కార్యాలయాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని, ఉత్తరాది జపాన్లో ఉన్న డీలర్లతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని నిస్సాన్ తెలిపింది. కాగా.. సయామా, మౌకా, హమామత్సు, సుజుకా ఫ్యాక్టరీలలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు హోండా మోటార్ కంపెనీ పేర్కొంది. ఇంకా తోషిబా వంటి పలు కంపెనీలు కూడా తమ ప్లాంట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి.
జపాన్లో శుక్రవారం రోజున 8.8 తీవ్రత కలిగిన భూకంపం సంభవించడంతో అతి భీకర సునామీ సంభవించిన సంగతి తెలిసిందే. సుమద్రపు అలలు 13 అడుగుల మేర ఎగసిపడి జపాన్ను ముంచి వేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య, ఆస్తి నష్టాల వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








