అపోలో బాటలోనే జేకే..: టైర్ల ధరల పెంపుకు ప్రణాళికలు..!

టైర్ల తయారీకి ఉపయోగించే ముడి సరుకుల ధరలు 2009-2010లో కేవలం 18-20 శాతం మాత్రమే పెరిగితే, 2010-11లో దాదాపు 50 శాతానికి పెరిగాయని మెహతా చెప్పారు. ఇప్పటికే పెరిగిన ఖర్చుల కారణంగా టైర్ల తయారీ కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి పడుతోందని, ఫలితంగా సదరు కంపెనీలు ఆర్థికంగా నష్టపోతున్నాయని చెప్పారు. పెరిగిన ముడి సరుకుల ధరలకు అనుగుణంగా టైర్ల ధరలను పెంచకపోయినట్లయితే టైర్ల కంపెనీల మనుగడ ప్రశ్నర్థకంగా మారే అవకాశం ఉందని మెహతా అన్నారు. గత నెలలో కూడా జేకే టైర్స్ తన ధరలను 2 శాతం వరకు పెంచింది. కాగా.. ఏప్రిల్ 1 నుంచి తమ ఉత్పత్తుల ధరలను 6 శాతం మేర పెంచుతున్నట్లు జేకే టైర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. ఇప్పటికే ఆటోమొబైల్ కంపెనీలపై జపాన్ సునామీ.. తీవ్ర ప్రభావాలను చూపుతున్న తరుణంలో దేశీయంగా లభ్యమయ్యే ముడి సరుకుల ధరలు కూడా చుక్కలనంటుతుండటంతో.. ఆటోమొబైల్ సంస్థలు ధరలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని ప్రముఖ ఆటో కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ఏప్రిల్ త్రైమాసికంలో పరిశీలిస్తామని ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. ఏదేమైనప్పటికీ పెరుగుతున్న ధరలతో ఇటు సామాన్యులు.. అటు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications








