రేంజ్ రోవర్ ఎవోక్ ఉత్పత్తిని ప్రారంభించిన జేఎల్ఆర్

రేంజ్ రోవర్ ఎవోక్ మోడల్కు ప్రంపచ మార్కెట్ల నుంచి వస్తున్న భారీ స్పందను దృష్టిలో ఉంచుకొని వీలైనంత త్వరలో ఈ మోడల్ను డెలివరీ చేసేందుకు కంపెనీ వర్క్ఫోర్స్ను కూడా రెండింతలకు (3,000 మంది ఉద్యోగులకు పైగా) పెంచింది. ఈ మోడల్ మొత్తం ఉత్పత్తిలో 75 శాతం ఉత్పత్తి 170 దేశాలకు పైగా ఎగుమతి అవుతాయి. ఈ ఎగుమతుల ద్వారా యూకే ఆర్థిక వ్యవస్థకు రెండు కోట్ల పౌండ్ల ఆదాయం వచ్చి చేరుతుంది. కాగా.. ఈ రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్యూవీ భారత మార్కెట్లోకి రావచ్చుననే కథనాలు వినపడుతున్నాయి. ఒక్క రేంజ్ రోవర్ ఎవోక్ మాత్రమే కాకుండా జేఎల్ఆర్ అందిస్తున్న అన్ని మోడళ్లను కూడా భారత్కు తీసుకురావాలని టాటా మోటార్స్ ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications








