సింగూర్ భూమిని ఖాళీగా ఉంచలేదు: టాటా మోటార్స్

పశ్చిమ బెంగాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (లీజ్ ఇచ్చినవారు) టాటా మోటార్స్ (లీజ్ తీసుకున్నవారు)కు లీజ్ ఇచ్చిన 997.11 ఎకరాల భూమిని లీజు ఇచ్చినప్పటి నుంచీ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసే వరకూ కూడా ఎక్కడా ఖాళీగా ఉంచలేదని కంపెనీ కౌన్సిలర్ సమ్రాదిత్య పాల్ కోర్టులో జస్టిస్ సౌమిత్రా పాల్కు తెలియజేశారు.
ఈ లీజు అగ్రిమెంట్ ప్రకారం.. లీజు అమలులోకి వచ్చిన తర్వాతి నుంచి సింగూరు భూములు 90 ఏళ్లపాటు టాటా మోటార్స్తోనే ఉంటాయని పాల్ తెలిపారు. కంపెనీ అధిక మొత్తాలలో పెట్టుబడులను వెచ్చించి భూములను అభివృద్ధి చేసి, రికార్డు సమయంలో కేవలం 13 నెలల్లోనే ప్లాంటును ఏర్పాటు నానో కారు ట్రైల్ ప్రొడక్షన్ను కూడా ప్రారంభించిందని ఆయన తెలిపారు.
ఈ ప్లాంటు అభివృద్ధి మరియు నిర్మాణం కోసం కంపెనీ రూ. 1,800 కోట్లు వెచ్చించిందని, నవంబర్ 2008 నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తిని చేపట్టాలని నిర్ణయించిందని పాల్ చెప్పారు. టాటా మోటార్స్ ఇప్పటికే మార్చి 2012 వరకూ లీజు అద్దెను చెల్లించిందని, ఈ అగ్రిమెంట్ ప్రకారం.. 90 ఏళ్ల వరకూ లీజు ఇచ్చివారి నుండి ఎలాంటి అంతరాయం లేకుండా ఒప్పందం సాఫీగా సాగాలని పేర్కొనబడి ఉందని ఆయన గుర్తు చేశారు.
కాగా.. పశ్చిమ బెంగాల్ సర్కారుకు మరియు టాటా మోటార్స్ మధ్య జరుగుతున్న ఈ భూవివాదంలో విచారణ రేపు కూడా కొనసాగనుంది. సింగూర్ బిల్లును సవాల్ చేస్తూ జూన్ 22వ తేదీన కలకత్తా హైకోర్టులో టాటా మోటార్స్ ఓ పిటిషన్ను దాఖలు చేయగా, జులై 4వ తేదీన దాన్ని సవరణ చేస్తూ మరో పిటిషన్ను దాఖలు చేసింది.


Click it and Unblock the Notifications








