వచ్చే ఏడాది భారత మార్కెట్లోకి రానున్న ల్యాండ్ రోవర్ ఎవోక్

ఐదు డోర్లు కలిగిన ఈ లగ్జరీ కాంపాక్ట్ ఎస్యూవీ మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్ క్లాస్, టొయోటా ప్రాడో, బిఎమ్డబ్ల్యూ ఎక్స్5, ఆడి క్యూ7 మోడళ్లకు సవాల్ విసరనుంది. పూణేలో కొత్తగా ఏర్పాటు చేసిన అసెంబ్లింగ్ ప్లాంటులో ల్యాండ్ రోవర్ ఎవోక్ ఎస్యూవీను సికెడి (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) యూనిట్లుగా దిగుమతి చేసుకొని భారత్లోనే అసెంబ్లింగ్ చేసే అవకాశం ఉంది. జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ను టాటా మోటార్స్ 2008లో స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ బ్రాండ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న లగ్జరీ బ్రాండ్గా ఎదుగుతూ.. అత్యధిక లాభాలను నమోదు చేస్తూ టాటా మోటార్స్కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.


Click it and Unblock the Notifications








