అన్ని వాహనాలపై రూ. 15,000 మేర ధరలు పెంచిన ఎమ్&ఎమ్

స్కార్పియో, బొలెరో వంటి యుటిలిటీ వాహనాలతో పాటు త్రిచక్ర వాణిజ్య వాహనాలను, సెడాన్ మోడల్ కారు లోగాన్ను కూడా కంపెనీ తయారుచేసి విక్రయిస్తుంది. కాగా.. ఈ సంవత్సరంలో మహీంద్రా అండ్ మహీంద్రా తమ వహనాల ధరలను పెంచడం ఇది రెండోసారి. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి నెలలో ఎమ్ అండ్ ఎమ్ వాహన ధరలను 1.5 శాతం మేర పెంచింది. దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి కూడా.. ఇదే కారణంతో ఏప్రిల్ 4వ తేదీ నుంచి అన్ని మోడళ్ల ధరలను రూ. 1,100 నుంచి రూ. 9,000 మేర పెంచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








