అన్ని వాహనాలపై రూ. 15,000 మేర ధరలు పెంచిన ఎమ్&ఎమ్

Mahindra
ముడి సరుకుల ధరల నెపంతో ఆటోమొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను మూడు నెలల్లోనే రెండోసారి పెంచి వినియోగదారుల నడ్డి విరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా తమ వాహనాల ధరలను రూ. 15,000 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. అధిక కమోడిటీ ధరల కారణంగా అన్ని రకాల వాహనలపై ధరలను 1.5 శాతం నుంచి 2 శాతం మేర పెంచుతున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా అధ్యక్షుడు (ఆటోమోటివ్ అండ్ ఫామ్ ఎక్విప్‌మెంట్) పవన్ గియోన్కా తెలిపారు. మోడల్‌ను బట్టి ధరలు రూ. 7,000 నుంచి రూ. 15,000 వరకూ పెరుగుతాయని ఆయన చెప్పారు. పెరిగిన ధరలు గత వారం నుంచే అమలులోకి రానున్నాయని కంపెనీ పేర్కొంది.

స్కార్పియో, బొలెరో వంటి యుటిలిటీ వాహనాలతో పాటు త్రిచక్ర వాణిజ్య వాహనాలను, సెడాన్ మోడల్ కారు లోగాన్‌ను కూడా కంపెనీ తయారుచేసి విక్రయిస్తుంది. కాగా.. ఈ సంవత్సరంలో మహీంద్రా అండ్ మహీంద్రా తమ వహనాల ధరలను పెంచడం ఇది రెండోసారి. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి నెలలో ఎమ్ అండ్ ఎమ్ వాహన ధరలను 1.5 శాతం మేర పెంచింది. దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి కూడా.. ఇదే కారణంతో ఏప్రిల్ 4వ తేదీ నుంచి అన్ని మోడళ్ల ధరలను రూ. 1,100 నుంచి రూ. 9,000 మేర పెంచిన సంగతి తెలిసిందే.

More from DriveSpark

Article Published On: Friday, April 8, 2011, 16:47 [IST]
English summary
Leading utility vehicle maker Mahindra & Mahindra raised prices of its entire range of vehicles by up to Rs 15,000 from last week.The price hike will vary between Rs 7,000 to Rs 15,000 on different models.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+