మహీంద్రా నుంచి డబుల్ క్యాబిన్ పికప్ 'జినియో'

ఇప్పటికే 'జినియో' ఫ్లాట్ఫామ్పై సింగిల్ క్యాబిన్ పికప్ ట్రక్లో క్యాబిన్లో డ్రైవర్తో పాటుగా ఒక్క ప్యాసింజర్ మాత్రమే ప్రయాణించడానికి వీలుంటుంది. అయితే, కొత్త పికప్ ట్రక్లో ఎక్కువమంది ప్రయాణికులు ప్రయాణించడంతో పాటు లగేజ్ను కూడా తీసుకువెళ్లేందుకు వీలుగా డబుల్ క్యాబిన్తో డిజైన్ చేసినట్లు కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ యొక్క మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వివేక్ నాయర్ తెలిపారు.
కంపెనీ ఇప్పటికే డబుల్ క్యాబిన్ ఆప్షన్ కలిగిన బొలెరో పికప్ ట్రక్ను అందిస్తున్న సంగతి తెలిసిందే. జినియో మరియు బొలెరో డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్లకు మధ్య ధర వ్యత్యాసం కేవలం రూ. 38,000 మాత్రమే. జినియో డబుల్ క్యాబిన్ పికప్ ట్రక్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 5.46 మొదలుకొని హైయర్ వేరియంట్ ధర రూ. 5.95 లక్షల వరకూ ఉంటుదని, అంతేకాకుండా ఇది ఓ అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తి అని నాయర్ చెప్పారు.


Click it and Unblock the Notifications








