రాష్ట్ర మార్కెట్లోకి ప్రవేశించిన మహీంద్రా జినియో డిసి

మహీంద్రా జినియో డిసి 75 హెచ్పి సామర్థ్యం కలిగిన ఎమ్డిఐ సిఆర్డిఈ ఇంజిన్తో గరిష్టంగా గంటకు 120 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇందులో డ్రైవర్తో పాటు మరో నలుగురు ప్రయాణించే వీలుంటుంది. వెనుక భాగంలో ఉండే ట్రాలీలో 1,100 కేజీ పేలోడ్ను తీసుకెళ్లవచ్చు. మహీంద్రా జినియో డిసి రెండు వేరియంట్లలో లభిస్తుంది. హై-ఎండ్ వేరియంట్ జినియో డిసి పికప్లో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వంటి సదుపాయాలుంటాయి.
రాష్ట్ర మార్కెట్లో జినియో డబుల్ క్యాబిన్ పికప్ బేస్ వెర్షన్ ధర రూ. 5.51 లక్షలు మరియు హైఎండ్ వెర్షన్ ధర రూ.6.01 లక్షలుగా నిర్ణయించినట్లు మహీంద్రా అండ్ మహీంద్రా జనరల్ మేనేజర్ (మార్కెటింగ్-ఆటోమోటివ్ డివిజన్) మహేష్ కులకర్ణి తెలిపారు. ఇది లీటర్ డీజిల్కు 13 కి.మీ. మైలేజ్ను ఇస్తుందని ఆయన తెలిపారు. మహీంద్రా ఇప్పటికే 'జినియో' ఫ్లాట్ఫామ్పై సింగిల్ క్యాబిన్ పికప్ ట్రక్ను మరియు డబుల్ క్యాబిన్ బొలెరో పికప్ ట్రక్ను అందిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








