అన్ని వాహనాల ధరలను 2% మేర పెంచిన ఎమ్ అండ్ ఎమ్

Mahindra Thar
ప్రముఖ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న అన్ని రకాల ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. గడచిన కొద్ది నెలలుగా పెరుగుతున్న ముడి సరుకుల ధరలను పరిగణలోకి తీసుకొని ధరలను 1.5 శాతం నుంచి 2 శాతం మేర పెంచుతున్నామని కంపెనీ సీనియర్ వైస్-ప్రెసిడెంట్ (మార్కెటింగ్ - ఆటోమోటివ్ సెక్టార్) వివేక్ నాయర్ తెలిపారు.

భవిష్యత్తులో ముడి సరుకుల ధరలు దిగిరాగలవలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఏడాది మహీంద్రా అండ్ మహీంద్రా ఇలా తమ ఉత్పత్తుల ధరలను పెంచడం ఇది మూడోసారి. తొలుత ఏడాది జనవరి నెలలో 1.5 శాతం ధరలను పెంచగా, ఏప్రిల్ నెలలో కూడా ఇదే వంకతోనే ఉత్పత్తుల ధరలను 1.5 శాతం నుంచి 2 శాతం మేర పెంచింది.

జులై, ఆగస్టు నెలల్లో అన్ని అగ్రాగమి ఆటో కంపెనీలు నిరుత్సాహకర ఫలితాలను ప్రకటిస్తే, ఎమ్ అండ్ ఎమ్ మాత్రం ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసుకుంది. జులై, ఆగస్టు నెలలు తమకు బాగా కలిసొచ్చాయని అలాగే, పండుగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో అమ్మకాలు జోరందుకోగలవని భావిస్తున్నామని నాయర్ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 6, 2011, 8:19 [IST]
English summary
India's leading utility vehicle manufacturer Mahindra and Mahindra (M and M) again hikes its vehicle prices by up to two per cent due to high raw material prices. "Margins have been a concern as raw material prices were going up in the past. We hope that it will come down in the future. We raised the prices last by 1.5-2 per cent," Mahindra & Mahindra (M&M) Senior Vice-President (Marketing - Automotive Sector) Vivek Nayer told reporters here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+