ఎమ్ అండ్ ఎమ్ నిరుత్సాహకర ఫలితాలు; షేర్లు ఢమాల్..!

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్కు పూర్తి అనుబంధ సంస్థ మహీంద్రా వెహికల్ మాన్యుఫ్యాక్చరర్స్ లిమిటెడ్ (ఎమ్విఎమ్ఎల్) లాభాలు కూడా ఇందులో కలిసి ఉన్నాయి. అయితే, మహీంద్రా అండ్ మహీంద్రా స్టాండ్ఎలోన్ ఫలితాల ప్రకారం కంపెనీ నికర లాభం 3 శాతం క్షీణించి రూ.737.4 కోట్లుగా నమోదైంది. ఈ నిరుత్సాహకర ఫలితాల కారణంగా సోమవారం స్టాక్ ఎక్సేంజ్లో కంపనీ షేర్లు ఏకంగా 7 శాతానికి పడిపోయాయి.
కాగా.. జులై-సెప్టెంబర్ 2011 త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 33.86 శాతం వృద్ధిని సాధించి రూ.8,299 కోట్లుగా ఉండగా, గడచిన సంవత్సరంలో ఇది రూ.6,200 కోట్లుగా నమోదైంది. ముడిపదార్థాల ధరలు భారీగా పెరిగినప్పటికీ తాము లాభాలను నమోదు చేసుకున్నామని కంపెనీ పేర్కొంది. ఈ త్రైమాసికంలో ప్యాసింజర్, యుటిలిటీ వాహనాల అమ్మకాలు 14 శాతం వృద్ధిని నమోదు చేసుకుని 47,523 యూనిట్లు అమ్మడయ్యాయి.


Click it and Unblock the Notifications








