తెలంగాణాలో మహీంద్రా ప్లాంట్కు అదనపు రాయితీలు: ప్రభుత్వం

కొత్తగా స్థాపింటబోయే ఈ ట్రాక్టర్ యూనిట్కు మహీంద్రా అండ్ మహీంద్రా 250 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా వెచ్చించనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి జె. గీతారెడ్డి, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి. శ్యామ్బాబు కూడా పాల్గొన్నారు. ఇతర సంస్థలకు రాయితీలు ఇచ్చిన విధంగానే మహీంద్రా అండ్ మహీంద్రాకు కూడా ఐదేళ్లపాటు 50 శాతం వ్యాట్ రీయింబర్స్మెంట్ ఇవ్వాలని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 2,000 మందికి అలాగే పరోక్షంగా మరో 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా.. వెనకబడిన తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటవుతున్న ఈ యూనిట్కు ఎస్ఐపీసీ సిఫారసు చేసిన దాని కంటే కూడా మరింత అదనంగా రాయితీలు మంజూరు చేయాలని మంత్రి గీతారెడ్డితో పాటు కంపెనీ కోరడంతో ముక్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications








