సింగూర్ బిల్లుపై సుప్రీం తీర్పును స్వాగతించిన మమత

Mamata Banerjee
టాటా మోటార్స్ నానో కారు ప్లాంటు కోసం కేటాయించిన భూములను తిరిగి రైతులకు పంపిణీ చేయడాన్ని నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వాగతించారు. "సుప్రీం కోర్టు ఆర్డర్‌ను మేము స్వాగతిస్తున్నాం. ఇది రైతులకు మరియు ప్రజలకు అనుకూలంగా వెళ్తుంద"ని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు ల్యాండ్ సర్వేను ఆపమనలేదని, ఈ కేసులో కలకత్తా హైకోర్టు తీర్పు వెలువడే వరకూ కేవలం భూముల పంపిణీ కార్యక్రమాన్ని మాత్రమే నిలిపివేయాలని ఆదేశించిందని మమత చెప్పారు.

మమతా బెనర్జీ సర్కారు ఆమోదించిన 'సింగూర్ ల్యాండ్ రిహాబిలేషన్ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్, 2011' బిల్లుపై ఈ రోజు ఉదయం సుప్రీం కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. తమకు కేటాయించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా టాటా మోటార్స్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు టాటా మోటార్స్ పిటిషన్‌ను తిరస్కరించడంతో మంగళవారం టాటా మోటార్స్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు భూపంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేయాలని మమత సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.

More from DriveSpark

Article Published On: Wednesday, June 29, 2011, 16:52 [IST]
English summary
West Bengal Chief Minister Mamata Banerjee welcomes the Supreme Court's interim order on the Singur land case. She told, the apex court only said that distribution of land would be stopped till the Calcutta High Court passes its judgement on the case.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+