రేపట్నుంచి మానేసర్ ప్లాంటుల్ ఉత్పత్తి యాధాతథం: మారుతి

"గత రాత్రి సమ్మె ముగియడంతో శనివారం నుంచి సాధారణ ఉత్పత్తి ప్రారంభమవుతుంద"ని కంపెనీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. మొత్తం 13 రోజుల పాటు జరిగిన ఈ సమ్మె కారణంగా కంపెనీ దాదాపు 12,600 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయినట్లు అంచనా, దీని విలువ సుమారు రూ. 630 కోట్లు. ఈ సందర్భంగా వర్కర్లు కూడా తమ విజయాన్ని పురస్కరించుకొని ప్లాంటులో శనివారం పూజ నిర్వహించి తమ పనిని ప్రారంభిస్తామని, ఆదివారం సాధారణంగా శెలవు అయినప్పటికీ కూడా నష్టపోయిన ఉత్పత్తి లోటును భర్తీ చేసేందుకు పనిచేస్తామని తెలిపారు.


Click it and Unblock the Notifications








