మరో రెండు వారాల్లో కిజాషి సేల్స్ ప్రారంభం..!

టొయోటా క్యామ్రే, వోక్స్వ్యాగన్ జెట్టా, హోండా అకార్డ్ వంటి విదేశీ కార్లు ధీటుగా కిజాషి నిలబడగలదని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తుంది. మారుతి సుజుకి మాతృ సంస్థ జపాన్కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్ ఈ లగ్జరీ కారును పూర్తిగా భారతీయ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది. ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్), క్రూయీజ్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 10-వే సీట్ అడ్జస్ట్మెంట్ వంటి అత్యాధునిక సేఫ్టీ సదుపాయాలు ఏర్పాటు చేయబడ్డాయి. మ్యాన్యువల్ గేర్ వ్యవస్థ కలిగిన కిజాషి కేవలం 7.8 సెకండ్లలోనే 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. అదే ఆటోమేటిక్ గేర్ వ్యవస్థ కలిగిన కిజాషి 8.8 సెకండ్లలో ఈ వేగాన్ని అందుకుంటుంది.
అలాగే.. మ్యాన్యువల్ వెర్షన్ కిజాషి గంటకు 215 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ...లీటరుకు 12.53 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని, అలాగే ఆటోమేటిక్ వెర్షన్ కిజాషి గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ లీటరుకు 12.45 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇక వీటి ధరల విషయానికి వస్తే.. మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ ధర రూ. 16.5 లక్షలు ఉండగా.. ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ మోడల్ ధర రూ. 17.5 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








