16 మంది రెగ్యులర్ వర్కర్లు సస్పెండ్, 12 మంది ట్రైనీలు ఫైర్

వర్కర్లు కావాలానే నాణ్యతలేని ఉత్పత్తులను రూపొందించి కంపెనీ పేరు ప్రతిష్టలకు నష్టం చేకురుస్తున్నారనే నెపంతో సోమవారం మారుతి సుజుకి యాజమన్యం 10 మంది శాశ్వత ఉద్యోగులను సస్పెండ్ చేయగా మరో ఐదుగురిని డిస్మిస్ మరియు ఆరుగురు ట్రైనీలను విధుల్లో నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. గుడ్ కండక్ట్ బాండ్పై సంతకం చేస్తేనే అనుమతిస్తామని మారుతి యాజమాన్యం పట్టుబట్టింది.
మారుతి మొండి పట్టు కారణంగా హర్యానాలోని మానేసర్ ప్లాంటులో రెండో రోజు కూడా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గడచిన జూన్ నెలలో మానేసర్ ప్లాంటులో కొత్తగా ఏర్పాటు చేసిన మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్ఈయూ)ను కంపెనీ యాజమాన్యం గుర్తించాలంటూ 13 రోజుల పాటు సమ్మె చేసిన విషయం విదితమే.


Click it and Unblock the Notifications








