ఏడవ ప్లాంటు ఏర్పాటుపై కన్నేసిన మారుతి సుజుకి

Maruti Plant
దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ) మరో కొత్త ప్లాంటును ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇప్పటికే మానేసర్‌లో మారుతి ఏర్పాటు చేస్తున్న రెండు కొత్త యూనిట్లకు ఎగువ భాగంలో ఏడో ప్లాంటును ఏర్పాటు చేయాలని కంపెనీ భావిస్తున్నట్లు సమాచారం. 2015-16 నాటికి ఏటా 30 లక్షల వాహనాలను అమ్మాలనే లక్ష్యంతో కంపెనీ విస్తరణ ప్రణాళికలను చేపట్టింది. మరో ఏడాదిలోపు ఈ ప్లాంటుకు సంబంధించి తుది నిర్ణయాన్ని కంపెనీ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం మానేసర్‌లో రూ. 3,625 కోట్ల పెట్టుబడితో మారుతి రెండు కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. మానేసర్‌లో ప్రస్తుతం ఉన్న ప్లాంటు ఉత్పత్తి సామర్ధ్యం సాలీనా 3,50,000 యూనిట్లుగా ఉంటే.. గుర్గావ్‌లో ఉన్న మూడు ప్లాంట్ల ద్వారా సాలీనా 8,50,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. 2015-16 నాటికి ప్యాసింజర్ వాహన మార్కెట్ 50 లక్షల యూనిట్లకు పెరుగుతుందని, తమ మార్కెట్ వాటాను సాధ్యమైనంత గరిష్టంగా ఉంచుకోవాలని భావిస్తున్నామని, అందుకోసం ఏటా 25 లక్షల యూనిట్ల నుంచి 30 లక్షల యూనిట్ల మధ్యలో వాహనాలను విక్రయిస్తామని మారుతి సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్‌సీ భార్గవ చెప్పారు.

More from DriveSpark

Article Published On: Monday, April 18, 2011, 11:56 [IST]
English summary
The Indian car giant Maruti Suzuki said it is aiming to install its seventh plant in addition to the proposed two plants in Manesar. This is to enhance the production capacity to 30 lakhs in another four or five years. The final decision in this regard will be taken in a year’s time as the preliminary efforts are underway, said an official of the company.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+