కోటి కార్ల ఉత్పత్తి మార్కును అధిగమించనున్న మారుతి

అంతేకాకుండా.. రానున్న 6-7 ఏళ్లలో వరుసగా రెండోసారి కూడా కోటి వాహనాల ఉత్పత్తి మార్కును సాధించగలమని మారుతి సుజుకి అంచనా వేస్తోంది. మనేసర్లో కంపెనీ నిర్మిస్తున్న రెండు కొత్త ప్లాంట్ల ద్వారా ఈ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించగలమని ఎమ్ఎస్ఐ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ ప్లాంట్ల నిర్మాణం కోసం 3,625 కోట్ల రూపాయలను కంపెనీ పెట్టుబడులుగా వెచ్చించనుంది. ఈ రెండు ప్లాంట్ల ద్వారా వార్షికంగా ఐదు లక్షల కార్లను మారుతి ఉత్పత్తి చేయనుంది. ఎమ్ఎస్ఐలో జపాన్కు చెందిన సుజుకి మోటార్ కార్పోరేషన్కు 54.2 శాతం వాటా ఉంది. ప్రస్తుతం గుర్గావ్ ప్లాంట్లో వార్షికంగా 8.5 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తుండగా.. మనేసర్ ప్లాంటులో 3.5 లక్షల కార్ల ఉత్పత్తిని సాధిస్తోంది.
అక్టోబర్ 2010 నుండి కంపెనీ ఉత్పత్తి ఏటా 10 శాతం (లక్ష కార్లకు పైగా) పెరుగుతూ వచ్చిందని, 2011-12 నాటికి ఇది వార్షికంగా 14 లక్షల యూనిట్లను తాకుతుందని కంపెనీ వివరించింది. డిసెంబర్ 14, 1983న తొలి ఎమ్800 కారును ఉత్పత్తిని ప్రారంభించిన మారుతి సుజుకి వచ్చే వారం నాటికి కోటి కార్లను ఉత్పత్తి మార్కును దాటనుంది. కోటి కార్ల ఉత్పత్తి మార్కును అధిగమించడం కేవలం ఒక మైలురాయి మాత్రమేనని, కానీ.. అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ చేతుల మీదుగా మొట్టమదటి కారును స్వీకరించడం తన జీవితంలో మరిచిపోలేని మధుర క్షణాలని మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్సి భార్గవ తెలిపారు. ప్రతి ఏటా 10 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయడం కూడా ఓ పెద్ద మైలురాయేనని ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications








