యూనియన్ ఎన్నికలను బహిష్కరించిన మానేసర్ కార్మికులు

Manesar workers boycott union elections
భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా మానేసర్ ప్లాంటులో నేడు జరగాల్సిన కీలకమైన యూనియన్ ఎన్నికలను ముందు నుంచి అంచనా వేస్తున్నట్లుగానే కార్మికులు బహిష్కరించారు. మానేసర్ ప్లాంటులో వర్కర్లు కొత్తగా ఏర్పాటు చేసిన యూనియన్‌ (మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్)ను యాజమాన్యం గుర్తించాలంటూ గత నెల నాలుగో తేదీ నుంచి వరుసగా 13 రోజుల పాటు కార్మికులు సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మారుతి సుజుకి ప్లాంటులో ఇప్పటికే ఉన్న యూనియన్ (మారుతి ఉద్యోగ్ కామ్‌ఘర్ యూనియన్)కు జరుగనున్న ఎన్నికల్లో తాము పాల్గొనబోమని, ఈ యూనియన్‌ను గుర్తించే ప్రసక్తే లేదని, తమ కొత్త యూనియన్‌ను గుర్తించి తీరాల్సిందేనని మరోసారి వర్కర్లు తమ గళం విప్పారు. ప్రస్తుతం కంపెనీ గుర్తించిన ఒకేఒక్క యూనియన్ మారుతి ఉద్యోగ్ కామ్‌ఘర్ యూనియన్ (ఎమ్‌యూకెయూ). ఈ యూనియన్‌లో ఎక్కువగా గుర్గావ్ ప్లాంట్ వర్కర్లే ఉన్నారు. దీంతో ఎమ్‌యూకెయూలో మానేసర్ వర్కర్ల ప్రాబల్యం తగ్గి గుర్గావ్ వర్కర్ల పలుకుబడి ఎక్కువగా ఉంది.

మానేసర్ ప్లాంటు నుంచి ముగ్గురు అభ్యర్థులను యాజమాన్యమే ఎన్నుకుందని, ఎన్నికలు సంబంధించిన ఎలాంటి సన్నాహాలు లేవని, తమ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా ఇందులో పాల్గొనబోవడం లేదని మారుతి సుజుకి ఎంప్లాయిస్ యూనియన్ (ఎమ్ఎస్ఈయూ) జనరల్ సెక్రటరీ శివ్ కుమార్ వెల్లడించారు. ఈ ఎన్నికలకు బదులు తమ యూనియన్ స్వంత ప్రణాళికలతో ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. హర్యానా ప్రభుత్వ కార్మిక శాఖలో తమ కొత్త యూనియన్ గుర్తింపును కోరుతూ ఎమ్ఎస్ఈయూ ఇప్పటికే ఓ ధరఖాస్తు కూడా అందజేసింది.

ఎమ్ఎస్ఈయూ కోసం వెరిఫికేషన్ విధానం కొనసాగుతోందని, ఒక్కసారి అది పూర్తయిన తర్వాత, త్వరలోనే తమ యూనియన్ నంబర్ రాగలదని భావిస్తున్నామని కుమార్ తెలిపారు. ఈ విషయంపై మారుతి సుజుకి ప్రతినిధిని సంప్రదించగా.. ఈ ఎన్నికలు యూనియన్ యొక్క అంతర్గత వ్యవహారమని, ఎన్నికల విధానానికి సంబంధించి మారుతి సుజుకి యాజమాన్యం కేవలం అడ్మినిస్ట్రేటివ్ మద్దతును మాత్రమే ఇస్తుందని తెలిపారు. కాగా.. గత నెలలో మానేసర్ ప్లాంటులో తలెత్తిన సమ్మె హర్యానా సర్కారు జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. ఈ సమ్మె కారణంగా కంపెనీ 12,600 యూనిట్ల ఉత్పత్తిని నష్టపోయింది, దీని విలువ సుమారు రూ. 630 కోట్లు ఉండవచ్చనని అంచనా.

More from DriveSpark

Article Published On: Saturday, July 16, 2011, 17:49 [IST]
English summary
Soon after the 13-day strike at Maruti Suzui's Manesar plant, the carmaker is facing another crisis as its workers from Manesar have boycotted the union elections to be held today. The carmaker has already suffered a production loss of 20 per cent in June.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+