మారుతి హర్యానాను వదిలిపెట్టి వెళ్లడం లేదు: ప్రభుత్వం

మారుతి హర్యానా నుంచి గుజరాత్కు పరిగెత్తడం లేదని, మారుతి సుజుకి రానున్న రెండేళ్లలో రాష్ట్రంలో రూ.3,700 కోట్ల పెట్టుబడులను పెట్టాలని ప్రతిపాదించిందని హర్యానా ప్రభుత్వం స్పష్టం చేసింది. "మానేసర్లోని సి ప్లాంటులో మారుతి రూ.2,000 కోట్ల పెట్టుబడిని వెచ్చించనుంది, దీనికితోడుగా రానున్న రెండేళ్లలో రోహ్తక్లో ఓ అంతర్జాతీయ పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్ అండ్ డి) ఏర్పాటుకు గానూ రూ.1,700 కోట్ల పెట్టుబడులను ప్రతిపాదించిందని" హర్యానా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య మరియు ప్రజా పనుల శాఖ మంత్రి రణదీప్ సింగ్ సుర్జెవాలా విలేఖరులతో తెలిపారు.


Click it and Unblock the Notifications








