మారుతిపై జపాన్ సునామీ ఎఫెక్ట్.. కోటి కార్ల ఫంక్షన్ రద్దు

అయితే జపాన్లో సంభవించిన ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా వీటి సరఫరాలకు అంతరాయం వాటిళ్లుతుందని మారుతి సుజుకి ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఈ అంశాన్ని మదింపు చేసే పనిలో ఉన్నామని కంపెనీ మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) మయాంక్ పారీక్ వెల్లడించారు. అయితే ఈ ప్రభావం తక్షణమే ఉండకపోవచ్చునని, దీర్ఘకాలంలో దీని ప్రభావంపై అంచనాలు వేస్తున్నామని ఆయన తెలిపారు. సాధారణంగా రెండు వారాలకు సరిపడా ముడి సరుకులు నిల్వ ఉంటాయని, అప్పటి వరకూ కంపెనీ ఉత్పత్తి యధావిధిగా కొనసాగుతుంటూనే ఉంటుందని పారీక్ వివరించారు.
మదింపు ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఎలాంటి వివరాలను వెల్లడించలేమని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. నేడు మారుతి సుజుకి ప్లాంటు నుండి కోటవ కారు ఉత్పత్తి కానుంది. ఈ సంధర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా వేడుకలు నిర్వహించాలని భావించిన మారుతి సుజుకి జపాన్లో నెలకొన్న విషాద పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ఉత్సవాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. జపాన్ సునామీ కారణంగా సోమవారం షేర్ మార్కెట్లో మారుతి సుజుకి షేర్లు 3 శాతం మేర పడిపోయాయి.


Click it and Unblock the Notifications








