మారుతి సుజుకిలో ఉద్యోగాల వెల్లువ..!

"ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 1,500 మందిని నియమించుకోనున్నాం. వీరిని తయారీ (మ్యానుఫ్యాక్చరింగ్), మార్కెటింగ్, సప్లయ్ చైన్ మరియు ఆర్ అండి డి విభాగాల్లో నియమించుకోనున్నామ"ని మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్) ఎస్ వై సిద్ధిక్వి తెలిపారు. మానేసర్ ప్లాంటులో ఏర్పాటు చేస్తున్న రెండు కొత్త ప్లాంట్ల కోసం 2.5 లక్షల పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఒక్కో ప్లాంటు ద్వారా సాలీనా 2.5 లక్షల యూనిట్ల ఉత్పత్తిని సాధించే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన నియామకాలే కాకుండా.. వచ్చే ఆర్థిక సంవత్సరం(2012-13)లో మానేసర్లోనే ఏర్పాటు చేయనున్న మూడో ప్లాంటు కోసం కూడా దాదాపు 750 మంది ఉద్యోగులను నియమించుకోనున్నామని సిద్ధిక్వి తెలిపారు.


Click it and Unblock the Notifications








