రానున్న రెండేళ్లలో 2,300 ఉద్యోగుల నియామకం: మారుతి

Maruti Suzuki
రానున్న రెండేళ్లలో దేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్ఐ)లో అకాశాలు వెల్లువెత్తున్నాయి. మానేసర్‌లో కంపెనీ నిర్మిస్తున్న రెండు ప్లాంట్ల కోసం వచ్చే రెండేళ్లలో కనీసం 2,300 మందిని విధుల్లోకి తీసుకోనున్నట్లు కంపనీ ఓ ప్రకటనలో పేర్కొంది. తమ సంస్థలో కొత్తగా చేర్చుకోబోయే 2,300 మంది సిబ్బందితో కలిపి మొత్తం కంపెనీ వర్క్‌ఫోర్స్ 27 శాతానికి అంటే దాదాపు 11,000 మంది ఉద్యోగులకు పెరగనుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,500 మందిని నియమిమచనున్నామని, వీరిని తయారీ, మార్కెటింగ్, సప్లయ్ చైన్, ఆర్ అండ్ డి వంటి వివిధ హోదాల్లో తీసుకుంటామని మారుతి సుజుకి ఇండియా మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (అడ్మినిస్ట్రేషన్) ఎస్ వై సిద్దిక్ వెల్లడించారు. మానేసర్ ఉత్పత్తి కేంద్రంలో 3,625 కోట్ల రూపాయల పెట్టుబడితో సాలీనా 2.5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం ఉన్న రెండు ప్లాంట్లను నిర్మిస్తున్నట్లు మారుతి పేర్కొంది. ఈఏడాది అక్టోబర్-సెప్టెంబర్ నాటికి మానేసర్‌లోని రెండవ యూనిట్‌ను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. ఇకపోతే మూడో యూనిట్‌ను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, April 11, 2011, 16:52 [IST]
English summary
India's largest carmaker Maruti Suzuki India said it will hire at least 2,300 people, for its upcoming two new plants in Manesar, within next two years. With induction of these people, the company's workforce will expand by about 27% to nearly 11,000 employees.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+